
న్యూడిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కరోనా కేసుల్లో క్రమంగా టాప్ లో ఉన్న దేశాలను చేరుకుంటుంది భారత్. తాజా లెక్కల ప్రకారం అత్యదికంగా కరోనా కేసులు నమోదవతున్న దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా మెదటి స్థానం, రెండవస్థానంలో బ్రేజిల్, తర్వాత రష్యా, స్పెయిన్, యూకే తర్వాత భారత్ ఉంది. కేసుల సంఖ్యలో ఇటలీని దాటింది భారత్.
గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరింది. ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా కరోనాతో 287 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 120406 ఉన్నాయి. ఆసుపత్రులలో చికిత్స తీసుకుని ఇప్పటి వరకు 119293 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 6929 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు 46,66,386 మందికి టెస్టులు చేశారు. మహారాష్ట్రా, డీల్లి, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మద్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవువుతున్నట్లు తెలిపారు అధికారులు.