ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు.. 77 మంది మృతి

ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు.. 77 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్రంలో 9999 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,47,686కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4779కి చేరింది.

గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు.

ఇక రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1499 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి 1081, చిత్తూరు 1040, గుంటూరు 920, ప్రకాశం 901, నెల్లూరు 778, కడప 698, విజయనగరం 594, శ్రీకాకుళం 570, అనంతపురం 557, కర్నూలు 497, కృష్ణా 451, విశాఖపట్నం 413 కరోనా కేసులు నమోదయ్యాయి.