
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే భర్తకు విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించింది భార్య. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. భార్య భర్తల మద్య చిన్న చిన్న గొడవలు మొదలవ్వడంతో అత్తింటికి వచ్చిన లింగమయ్యకు పాలల్లో విషం కలిపింది నాగమణి. ఆ పాలు తాగిన లింగమయ్య అపాస్మారక స్థితికి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అతడిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిక ితరలించారు. కేసు నమోదు చేసుకున్న గుత్తి పోలీసులు జొన్నగిరి పీఎస్ కి బదలాయించారు.