బిల్డింగ్ స్లాబ్ కూలి ఇద్దరు కార్మికుల మృతి

బిల్డింగ్ స్లాబ్ కూలి ఇద్దరు కార్మికుల మృతి

శంషాబాద్, వెలుగు : పహాడీ షరీఫ్  సమీపంలోని మామిడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న  బిల్డింగ్​స్లాబ్ ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది బిల్డింగ్​ రెండవ అంతస్తులో స్లాబ్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కూలిపోయింది.  స్లాబ్ కూలిపోయి కింద అంతస్తులో ఉన్నవారిపై పడడంతో స్పాట్​లోనే ఇద్దరు కార్మికులు జగదీష్ బిడిక(49) తిలక్ పత్(33) మృతి చెందారు.

ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందిన కార్మికులు ఒడిశా, యూపీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  బిల్డింగ్​యజమాని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పహాడీ షరీఫ్​ పోలీసులు తెలిపారు.