బగ్గ తాగి ట్రాఫిక్ ఏఎస్సై పై దాడి

బగ్గ తాగి ట్రాఫిక్ ఏఎస్సై పై దాడి

శంషాబాద్, వెలుగు : మత్తులో ఉన్న ఓ ప్రైవేట్  ఎంప్లాయి వెహికల్ ను ఆపినందుకు ట్రాఫిక్ ఎస్సై పై దాడికి దిగాడు. శంషా బాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్న శ్రీరాములు ఫుల్ గా మందు తాగి టాటా సుమో నడుపుతూ హిమాయత్ సాగర్ వైపు వెళ్తున్నాడు. అక్కడే వెహికల్స్ తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై ఆపడంతో నన్నే ఆపుతావా అంటూ దాడికి దిగాడు. దీంతో అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయగా 234 పర్సం టేజ్ వచ్చింది. దీంతో వెహికల్ సీజ్ చేసి…నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ పార్సిల్ ఇక ఇంటికే తెచ్చిస్తారు