హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని పద్మావతి కాలనీలో మహిళా కానిస్టేబుల్ మూడు అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలైన మహిళా కానిస్టేబ్ ల్ ప్రమీలను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలతోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
2020 బ్యాచ్ కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ లో ప్రమీల భర్త బాలాజీ నాయక్, ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటుంది. కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ ప్రమీల తను నివాసం ఉంటున్న పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ 3 అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటా హుటిన ప్రమీలను ఉప్పల్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ తరలించారు స్థానికులు. మెరుగైన చికిత్స కోసం ప్రమీలను భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవి పహార్ తండా చెందిన వారు కాదా ఉద్యోగరీత్యా ఉప్పల్ పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
