ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇండస్ట్రియల్​ పార్క్​లు రాబోతున్నాయి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇండస్ట్రియల్​ పార్క్​లు రాబోతున్నాయి

దేవరకొండ, నల్గొండ, నకిరేకల్, ఆలేరు, హుజూర్ నగర్​లో కొత్త పార్క్​లు 
పలు చోట్ల భూములుదొరక్క ఇబ్బందులు
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భూములకే ప్రాధాన్యం

నల్గొండ, వెలుగు :ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా మరికొన్ని ఇండస్ట్రియల్​ పార్క్​లు రాబోతున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు, కొత్తగా మరికొన్ని పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని   పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆలోచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న ప్రధాన మండలాలు, పట్టణాలకు సమీపంలో ఇండ్రస్ట్రియల్​ పార్క్​ల కోసం స్థలాన్ని సేకరిస్తోంది.  కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులోనే ఉన్న ప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అసైన్డ్​ భూముల పైనే ఆధారపడి పడాల్సి వస్తోంది. అసైన్డ్​ భూములను స్వాధీనం చేసుకోవడం పైన పలు చో ట్ల రైతులు, బాధితుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో  నచ్చజెప్పి భూములు స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 

నాన్​ ఆయకట్టు ఏరియాల పైనే ఫోకస్​...

పారిశ్రామిక కారిడార్​ల ఏర్పాటుకు భూముల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ఆయకట్టు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉండటంతో మిర్యాలగూడ, నాగార్జునసాగర్​, కోదాడ నియోజకవర్గాల్లో ఇండ్రస్ట్రియల్​ పార్క్​లు ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు. ఇటీవల మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆలగడపలో ప్రతిపాదించిన ఇండ్రస్ట్రియల్​ పార్క్​ రైతు లు అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఆలగడపలో భూముల ధరలు కోట్లు పలుకుతుండటంతో అక్కడి రైతులు ఇండ్రస్ట్రీ వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కొందరు రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్డును ఆశ్రయిం చడంతో ఆలగడప ప్రతిపాదన ఆగిపోయింది. దీంతో నాన్​ ఆయకట్టు ఏరియాల పైన అధికారులు దృష్టి పెట్టారు. ఎక్కడ కొద్దిపాటి భూములు దొరి కినా ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. 

హైవేలకు దగ్గరగా  పార్క్​లు...

జాతీయ, రాష్ట్ర రహాదారులకు సమీపంలోనే కొత్త ఇండ్రస్ట్రియల్​ పార్క్​లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్​–విజయవా డ ప్రధాన జాతీయ రహదారి, నార్కట్​పల్లి టు అద్దంకి, మాచర్ల – హైద రాబాద్​, కోదాడ టు జడ్చర్ల, హైదరాబాద్​ టు వరంగల్​ హైవే సమీపంలోని మండలాల్లో భూముల సేకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు మండలాల్లో భూములు సేకరణ పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల అసైన్డ్​ భూముల స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్​ ఇవ్వాల్సి ఉంది. నల్గొం డ, దేవరకొండ, ఆలేరు, హుజూర్​నగర్​, నకిరేకల్​ నియోజకవర్గాల్లో కొత్త ఇండ్రస్ట్రియల్​ పా ర్క్​లు ప్రతిపాదించారు. 

పార్క్​లు ప్రతిపాదిత ప్రాంతాలు ...

నల్గొండ సమీపంలోని తిప్పరి మండలం కేశరాజుపల్లిలో 11 ఎకరాలు, కొండమల్లేపల్లి మం డలం కోల్​ముంతల్​పహాడ్ లో 240 ఎకరాలు, నల్గొండ మండలం అన్నెపర్తి వద్ద 30 ఎకరాలు, చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద 80 ఎకరాలు, ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి వద్ద 150 ఎకరాలు, నేరేడుచర్లలో ఆటోనగర్​ కోసం 11 ఎకరా లు, చిట్యాల మండలం వెలిమినే డు వద్ద 450 ఎ కరాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ జోన్​ ఏర్పాటు కానుంది. అయితే ఇండ్రస్ట్రియల్​ పార్క్​ల ఏర్పాటు  వేగవంతం కావాలంటే ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫండ్స్​ రిలీజ్​ చేయాలి. రోడ్లు, కరెంట్​, ఇతర మౌలిక సదుపాపాయాల కల్పనకు ప్రభుత్వం ఫండ్స్​ ఇస్తేనే  పార్క్​లను త్వరగా డెవలప్​ చేయడానికి వీలవుతుంది. ​