రన్నింగ్​ కారులో చెలరేగిన మంటలు

రన్నింగ్​ కారులో చెలరేగిన మంటలు

రన్నింగ్​కారులో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 24 అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారుతో వస్తున్న పలువురు హస్తినాపురంలోని పద్మావతి నగర్​కి రాగానే వాహనంలో కాలుతున్న వాసన వచ్చింది. 

అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకి వచ్చారు. మంటలు చెలరేగి క్షణాల్లో కారు అగ్నికి ఆహుతి అయింది.  ప్రయాణికులు సేఫ్​గా బయటపడ్డారు.