స్కూల్ బస్సు కింద పడి నాలుగేండ్ల బాలుడి మృతి

స్కూల్ బస్సు కింద పడి నాలుగేండ్ల బాలుడి మృతి

చర్లపల్లి డివిజన్ బీఎన్​రెడ్డి నగర్​లో విషాచర్లపల్లి, వెలుగు: స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన చర్లపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. శుక్రవారం బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో అక్క, అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు అమ్మమ్మతో కలిసి వెళ్లిన ప్రణయ్(4) బస్సు ముందు నిల్చున్నాడు.

డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు నడిపించడంతో టైర్ల కింద పడి ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్​బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.