కృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ

కృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ

విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు విసిరిన వలకు కొండచిలువ చిక్కుకుంది. వలను బలంగా లాగుతుండడంతో పెద్ద చేపలు పడ్డాయని బయటకు తీసిన జాలర్లకు కొండ చిలువ కనిపించింది. బుసలు కొడుతూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దానిని అదుపు చేస్తూ.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు జాలర్లు.