బేగంబజార్ లోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అగ్ని ప్రమాదం

బేగంబజార్ లోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: బేగంబజార్ లోని నవభారత్ ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అర్ధరాత్రి  అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి  సందర్భంగా  టపాసులు గోదాంలోని కేబుల్ వైర్లపై పడడంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, షాహీనాయత్ గంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను రెండు ఫైర్ ఇంజన్లతో అదుపుచేశారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు యజమాని చెబుతున్నారు.

టపాసులు పడి కోళ్ల ఫామ్ దగ్ధం..1200 కోళ్లు మృతి