
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెట్రోస్టేషన్ సర్వీస్ రోడ్డులోని ఎమ్ఎస్ ఫర్నిచర్ షోరూమ్ లో ప్రమాదం జరిగింది. ఫర్నీచర్ షాపులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
మూడు అంతస్తులకు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మిగతా మూడు దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకున్నాయి.
ప్రస్తుతం మెట్రోస్టేషన్ లోపల నుంచి నీళ్లు పంప్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఎంత మేరకు నష్టం జరిగిందన్నది విచారణ తర్వాత తేలనుంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
మరోవైపు.. అగ్నిప్రమాదం జరిగిన స్థలంలో భారీగా పొగ వ్యాపించింది. దీంతో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు.