మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రెహ్మత్ నగర్ లో భార్య ముఖంపై యాసిడ్ తో దాడి చేశాడో భర్త. ఇక వివరాల్లోకి వెళ్తే.. రెహ్మత్ నగర్ లో మహ్మద్ సయీద్ అలీ, అఫ్స బేగం దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. పలు విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో 2023 జూలై 02 రోజున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అలీ కోపంలో తన భార్య బేగంపై వాష్ రూం క్లీనర్ యాసిడ్ పోశాడు. దీంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రిరకి తరలించారు. ప్రస్తుతం అఫ్స బేగం రెండు కళ్ళకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై తన భర్త అలీపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బేగం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.