ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా నామినేషన్లు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా నామినేషన్లు
  •     కామారెడ్డి, ఆర్మూర్​లో బీజేపీ క్యాండిడేట్లకు మద్దతుగా హాజరైన కేంద్రమంత్రులు
  •     బాల్కొండలో హాజరైన ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్​ 
  •     బుధవారం ఒక్కరోజే 61 నామినేషన్లు

నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాల, ఆర్మూర్​లో రాకేశ్​రెడ్డికి మద్దతుగా కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్​భట్​హాజరయ్యారు. బాల్కొండ బీజీపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ నామినేషన్​ ప్రోగ్రామ్​కు ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్​ అటెండ్​ అయ్యారు. నిజామాబాద్​ జిల్లాలో 25 నామినేషన్లు దాఖలయ్యాయి.

నిజామాబాద్​అర్బన్​ నుంచి ధన్​పాల్​(బీజేపీ), ఫజల్‌ కరీం​(ఎన్సీపీ), ఎండీ జహీరుద్దీన్​(ఎంబీటీ), మౌలానా ఖాన్​(ఇండిపెండెంట్​), లక్క అశోక్​ (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ) నామినేషన్లు వేశారు.  రూరల్ నుంచి గుగులోత్​ బాలరాజ్​(ఇండిపెండెంట్), బీబీ నాయక్​(ఇండిపెండెంట్), బాల్కొండలో అన్నపూర్ణమ్మ (బీజేపీ), పల్లికొండ నర్సయ్య (బీఎస్పీ), ఆర్మూర్​లో పైడి రాకేశ్​రెడ్డి (బీజేపీ), రాజేశ్​(ఇండిపెండెంట్) నామినేషన్లు వేశారు. బోధన్ గోపి కిషన్​ (శివసేన), మోహన్​రెడ్డి (బీజేపీ), ఎండీ యూసుఫ్​(ఇండిపెండెంట్), సయ్యద్​ అస్గర్​(ఇండిపెండెంట్), రజితవాణి (పిరమిడ్ ​పార్టీ ఆఫ్​ ఇండియా), మోసిన్​(ఎంసీపీఐ), బాన్సువాడ నుంచి కాసుల రోహిత్​(ఇండియన్​నేషనల్​ కాంగ్రెస్​), కాసుల బాలరాజ్​(కాంగ్రెస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), కూనింటి రామ్​(ఇండిపెండెంట్), డి.సుభాష్​ (ఇండిపెండెంట్), షేక్​ గౌస్​(ఇండిపెండెంట్), గోపాల్​(ఎంసీపీఐ), తోట శ్రీకాంత్​(ధర్మసమాజ్​పార్టీ) నామినేషన్లు వేశారు. కామారెడ్డి జిల్లాలో 36 నామినేషన్లు వచ్చాయి.  బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి తరపున మాజీమంత్రి షబ్బీర్​అలీ నామినేషన్లు​ వేశారు.

ఉడుతవార్​ సురేశ్​గౌడ్​(బీఎస్పీ), సిరిగాధ సిద్ధిరాములు (బీఎల్ఎఫ్), ఇండిపెండెంట్లుగా ముత్యం, నర్సింలు, ఎర్రోల్ల నరేశ్, చిందం మల్లయ్య,  నీల నాగరాజు, ఆకుల హరీశ్, చెవుల పరశురాములు, దొడ్లే రాజేందర్, మాధవ్​రెడ్డి నామినేషన్​వేశారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ అభ్యర్థి కె.మదన్​మోహన్​రావు, జమున (బీఎస్పీ), అమర్​సింగ్ (ఆమ్​ఆద్మీ పార్టీ), లక్ష్మయ్య (ధర్మ సమాజ్​పార్టీ), ఇండిపెండెంట్లుగా బద్యా నాయక్, బంతిలాల్​మంజా నామినేషన్ దాఖలు చేశారు.  జుక్కల్​లో అరుణతార (బీజేపీ), హన్మంత్​ షిండే తరపున (బీఆర్ఎస్), బాబు (బహుజన భారత్​పార్టీ), భూమయ్య (ధర్మ సమాజ్​పార్టీ), ఇండిపెండెంట్లుగా రాజు, సాయిలు, గైని ప్రేమ్​కుమార్, గైక్వాడ్​ప్రకాశ్​ నామినేషన్​ వేశారు.