కోడికూర కోసం భార్యను చంపి పరారయ్యాడు

కోడికూర కోసం భార్యను చంపి పరారయ్యాడు

లింగాల, వెలుగు: కోడి కూర వండలేదని  భార్యను కొట్టి చంపాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన  నాగర్​కర్నూల్​జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య  వివరాల ప్రకారం..  క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన  నిమ్మల సన్నయ్య, సీతమ్మ భార్యభర్తలు. దసరా పండగ రోజు సన్నయ్య కోడి కూర వండమని చెప్పగా భార్య వండలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన  భార్య సీతమ్మ(38)ను  పొలం వద్ద కట్టెతో  విచక్షణారహితంగా కొట్టాడు.  తీవ్రంగా గాయపడడంతో ఆయనే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది.  తెల్లారి 26న తన భార్య సారా తాగి చనిపోయిందని గ్రామస్తులకు చెప్పాడు. వారికి అనుమానం రావడంతో భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి పరారయ్యాడు. సీతమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న సన్నయ్య కోసం గాలిస్తున్నామన్నారు.