వ్యక్తి ప్రాణం తీసిన ఫ్లెక్సీ..ఇనుక కడ్డీకోసం వెళ్తే కరెంట్ షాక్ కొట్టింది

వ్యక్తి ప్రాణం తీసిన ఫ్లెక్సీ..ఇనుక కడ్డీకోసం వెళ్తే కరెంట్ షాక్ కొట్టింది

కుత్బుల్లాపూర్ : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి రామస్వామి(38) అనే వ్యక్తి గురువారం (ఆగస్టు 24న) చనిపోయాడు. ఇతను స్క్రాప్ సేకరించే వ్యక్తిగా గుర్తించారు. ఫ్లెక్సీకి ఉన్న ఇనుప కడ్డీని సేకరించే క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ కు ఇనుప రాడ్ తగలడంతో మృతి చెందాడు.

బుధవారం రోజు (ఆగస్టు 23న) మెదక్ సభకు సీఎం కేసీఆర్ వెళ్లిన క్రమంలో కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను తీసే క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామస్వామి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.