నమ్మించి మోసం: బంగారం అమ్ముతామని.. రూ.కోటితో పరారీ

నమ్మించి మోసం: బంగారం అమ్ముతామని.. రూ.కోటితో పరారీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని దుండగులు రూ.కోటితో పరారయ్యారు. మార్కెట్ పీఎస్ ఇన్​స్పెక్టర్ రాంచందర్ వివరాల ప్రకారం.. తొలుత కారులో వచ్చిన ఆరుగురు దుండగులు కిలో బంగారం తమ వద్ద ఉందని, తక్కువ ధరకు ఇస్తామని ఓ వ్యాపారిని సంప్రదించారు. 

డబ్బులు ఉన్నట్లు చూపిస్తే అమ్ముతామని నమ్మించారు. దీంతో వ్యాపారి రూ.కోటి ఉన్నాయంటూ చూపించడంతో ప్లేట్ ఫిరాయించారు. తాము బాలాజీ నగర్ పీఎస్ కు చెందిన ఎస్ఓటీ పోలీసులమంటూ బురిడీ కొట్టించి, డబ్బులతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో 8వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కేశవ్​  ఉండడం గమనార్హం.