అల్వాల్ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలింత ఇద్దరు పసికందులతో సంపులో మునిగి ఆత్మహత్య చేసుకుంది. తల్లితో పాటు నెల కూడా నిండని పసికందులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.
‘శివనగర్లో నివసించే సంధ్యారాణికి గతంలో ఒకసారి మగబిడ్డ పుట్టి కొన్నిరోజులకే చనిపోయాడు. ఈ నెల 11 మరోసారి సంధ్యరాణికి ఇద్దరు కవలలు పుట్టారు. అయితే వారిలో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. అయితే మేనరికం చేసుకోవడం వల్ల కవలలు బతకరనే భయంతో ఇంట్లోని సంపులో ఇద్దరు పిల్లలతో కలిసి సంపులో మునిగి ప్రాణాలు తీసుకుంది’ అని అల్వాల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.