శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు

శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితులు నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రాణాలు కోల్పోయిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ఆటోనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.