కాశీబుగ్గలో నోరూరించిన ఫుడ్​ ఫెస్టివల్

కాశీబుగ్గలో నోరూరించిన ఫుడ్​ ఫెస్టివల్

కాశీబుగ్గ, వెలుగు:  సిటీలోని కీవి స్కూల్​లో శనివారం ఫుడ్​ ఫెస్టివల్​ ​  నోరూరించింది. స్కూల్​ ప్రిన్సిపాల్​ దాసి సతీశ్​​ మూర్తి, డైరెక్టర్​ దాసి రజిని మాట్లాడుతూ  సుమారుగా 150 వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి దగ్గరే పేరెంట్స్​ సహకారంతో తయారు చేశారని చెప్పారు.   కల్తీ ఆహారాలు, జంక్​ ఫుడ్​ తినడం వల్ల  రోగాల బారిన  పడుతున్నారని చెప్పారు. అందుకే ఇంటి ఆహారంపై అవగాహన కల్పిస్తూ ఫుడ్​ ఫెస్టివల్​ నిర్వహించినట్టు తెలిపారు.  ప్రవీణ్​ కుమార్​, రవితేజ, రంజిత, జోష్న, స్రవంతి, మంజుల,  200ల మంది స్టూడెంట్స్​ పాల్గొన్నారు.