హైదరాబాద్ సిటీ రోడ్డుపై నిప్పుపెట్టుకున్న వ్యక్తి

హైదరాబాద్ సిటీ రోడ్డుపై నిప్పుపెట్టుకున్న వ్యక్తి

హైదరాబాద్ నడిబొడ్డున ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని సూసైడ్కు ప్రయత్నించాడు. కొత్తపేట చౌరస్తాలో సురేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు..అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అసలేమైంది..

స్థానిక NTR నగర్కు చెందిన సురేష్ ,మమత అనే దంపతుల మధ్య  తరచూ గొడవులు జరుతుగుతున్నాయి. ఇదే క్రమంలో మార్చి 23వ తేదీన కూడా భార్యాభర్తల మధ్య గొడవ నెలకొనడంతో సురేష్  ఫుల్ గా మద్యం సేవించాడు. ఆ తర్వాత కొత్తపేట చౌరస్తాలో  ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.