నిలోఫర్ ఆసుపత్రి భోజన కాంట్రాక్టర్ అక్రమాలపై హైకోర్టులో పిటిషన్

నిలోఫర్ ఆసుపత్రి భోజన కాంట్రాక్టర్ అక్రమాలపై  హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రిలో భోజనం కాంట్రాక్టర్ అక్రమాలపై దర్యాప్తు జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంట్రాక్టర్ సురేష్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టులో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పిల్ వేశారు. తప్పుడు బిల్లులతో కాంట్రాక్టర్ నిధులు దుర్వినియోగం చేశారని, ఆయ‌న‌పై విచార‌ణ‌ నివేదికను సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అదే కాంట్రాక్టర్ ను గాంధీ, ఛాతీ ఆస్పత్రిల్లోనూ..ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. అతనిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో సెప్టెంబర్ 16లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని అదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్16 కు వాయిదా వేసింది.