ఓయూలో రీసెర్చ్ స్కాలర్​కు పాముకాటు

ఓయూలో రీసెర్చ్ స్కాలర్​కు పాముకాటు
  • గాంధీకి తరలించిన తోటి స్టూడెంట్లు

ఓయూ, వెలుగు: ఓయూలో ఓ  రీసెర్చ్ స్కాలర్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో తోటి స్టూడెంట్లు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్​జిల్లాకు చెందిన బేగారి విష్ణు ఓయూలో పబ్లిక్​అడ్మినిస్ట్రేషన్​లో పీహెచ్​డీ చేస్తూ అక్కడి ఎన్ఆర్ఎస్ ​హాస్టల్​లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేశాక హాస్టల్​బయట మెట్ల వద్ద నిలబడగా ఓ పాము అతని బొటన వేలుపై కాటేసింది. అనుమానించిన అతడు మిగతా స్టూడెంట్లకు చెప్పగా.. సెల్​ఫోన్​ లైట్లతో కింద వెతకడంతో రక్త పింజరి పాము కనిపించింది. దీంతో వెంటనే విష్ణును చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హాస్టల్​ ముందు లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో చాలా చీకటిగా ఉంటోందని.. పాములు, విష పురుగులు తిరుగుతున్నా కనిపించడం లేదని స్టూడెంట్లు పేర్కొంటున్నారు. లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే విష్ణు పాముకాటుకు గురయ్యాడని మండిపడ్డారు.