
- గాంధీకి తరలించిన తోటి స్టూడెంట్లు
ఓయూ, వెలుగు: ఓయూలో ఓ రీసెర్చ్ స్కాలర్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో తోటి స్టూడెంట్లు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్జిల్లాకు చెందిన బేగారి విష్ణు ఓయూలో పబ్లిక్అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేస్తూ అక్కడి ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేశాక హాస్టల్బయట మెట్ల వద్ద నిలబడగా ఓ పాము అతని బొటన వేలుపై కాటేసింది. అనుమానించిన అతడు మిగతా స్టూడెంట్లకు చెప్పగా.. సెల్ఫోన్ లైట్లతో కింద వెతకడంతో రక్త పింజరి పాము కనిపించింది. దీంతో వెంటనే విష్ణును చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హాస్టల్ ముందు లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో చాలా చీకటిగా ఉంటోందని.. పాములు, విష పురుగులు తిరుగుతున్నా కనిపించడం లేదని స్టూడెంట్లు పేర్కొంటున్నారు. లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే విష్ణు పాముకాటుకు గురయ్యాడని మండిపడ్డారు.