గుజరాత్ లో తప్పిన పెను ప్రమాదం

గుజరాత్ లో తప్పిన పెను ప్రమాదం

గుజరాత్ లో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 35 మంది విద్యార్థులు వరద ఉదృతి నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకుని బోల్తా పడింది. ఆ సమయంలో  బస్సులో ఉన్న విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు. అధికారులు వెంటనే స్పందించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జేసీబీకి తాళ్లు కట్టివారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. జామ్ నగర్ జిల్లా కలవాడ్ లో స్టూడెంట్స్ ను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తుండగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదకరంగా వరద ఉధృతి కొనసాగుతున్నా..బస్సు డ్రైవర్ లెక్కచేయకుండా తీసుకెళ్లడంతో బస్సు వరదలో చిక్కుకుని బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు. తమ కంటి పాపలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన స్థానికులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.