పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఢీకొని.. పల్టీలు కొట్టిన కార్లు

పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఢీకొని.. పల్టీలు కొట్టిన కార్లు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై వరుసగా నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో దాదాపు కిలోమీటర్ వరకూ ట్రాఫిక్ స్తంభించింది. శనివారం (సెప్టెంబర్ 16న ) తెల్లవారుజామున పిల్లర్ నెంబర్ 139 వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఓ వ్యాన్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 139 వద్ద అకస్మాత్తుగా ఆగింది. వెనకాల వస్తున్న కారు దానిని తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీకొంది. దాని వెనకాల వచ్చిన మరో మూడు కార్లు వరుసగా ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి.

ALSO READ: సర్కార్ హాస్టల్స్​లో ఉన్న సౌలత్​లపై రిపోర్ట్ ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

విషయం తెలియగానే రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనాలను నియంత్రించారు. ధ్వంసమైన కారులను అక్కడి నుంచి తరలించారు.