
హైదరాబాద్, వెలుగు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని, ఇందుకు తెలుగు రాష్ర్టాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కోరారు. రాష్ర్ట ప్రభుత్వం తరుపున కూడా కోరుతామన్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడారు.
దేశాన్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి అని చెప్పారు. పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడని కొనియాడారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలన్నారు. అల్లూరి127 జయంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు క్షత్రియ సేవా సమితికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.పా