- పరిస్థితి విషమం
గచ్చిబౌలి, వెలుగు: లెక్కలు సరిగా చేయడం లేదని పదో తరగతి విద్యార్థిని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ గోడ కుర్చీ వేయించాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాయదుర్గం సీఐ సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని నాగార్జున హైస్కూల్లో బాలు అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు.
ఇదే స్కూల్లో అబ్దుల్ నయీమ్ మాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న లెక్కలు సరిగా చేయడం లేదని గోడ కుర్చీ వేయించడంతోపాటు అందరి ముందు తిట్టడంతో బాలు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇంటికి వెళ్లి, ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తల్లిదండ్రులు గమనించి బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే, అందరి ముందు తిట్టడం, గోడ కుర్చీ వేయించిన కారణంగానే తన కొడుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాలుడి తల్లి రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
