
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్, బాచుపల్లి మండలాల్లో సోమవారం హైడ్రా అధికారుల బృందం పర్యటించింది. చెరువులు, నాలాలను పరిశీలించింది. సర్వే నంబర్ 181లోని జిన్నారం అడవుల నుంచి కత్వ చెరువులోకి వచ్చే ప్రధాన నాలాలను పలువురు ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మించారు. దీంతో వర్షం నీరు చెరువులోకి వెళ్లడం లేదు. ఇరిగేషన్అధికారులు ఆదివారం ప్రత్యామ్నాయంగా మరో నాలాలను తవ్వి వర్షపు నీటిని చెరువులోకి మళ్లించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొందరు ఆక్రమణదారులు ఆ నాలాను ధ్వంసం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్, హైడ్రా అధికారులు, బీజేపీ నాయకులు సోమవారం ఉదయం కత్వాచెరువు, నాలాలను పరిశీలించారు. తిరిగి నాలాను పునరుద్ధరించారు. జిన్నారం, దుండిగల్అధికారులతో జాయింట్సర్వే చేయించాలని హైడ్రా నిర్ణయించింది. అనంతరం కత్వ చెరువును ఆనుకుని నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలను పరిశీలించారు. కొన్ని విల్లాలు ఎఫ్టీఎల్, బఫర్జోన్లోకి వచ్చినట్లు గుర్తించారు.
సర్వేనెంబర్ 166 బౌరంపేట నుంచి వచ్చే నేరెళ్ల వాగు ఆక్రమణలను పరిశీలించారు. వాగును సర్వే చేయించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి హైడ్రా బృందం బాచుపల్లిలోని వాసవి కన్స్ట్రక్షన్స్ను పరిశీలించింది. ఇందులోని 8, 9 బ్లాకులు కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లో నిర్మించినట్లు గుర్తించారు. 8వ బ్లాక్పుట్టింగ్స్టేజీలో ఉండగా, 9వ బ్లాక్ను 23 ఫ్లోర్లు నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొసాగుతున్నాయి.
ఈ సందర్భంగా స్థానికులు ఎల్లమ్మకుంట చెరువు మత్తడి ఆక్రమణకు గురైనట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. పరిశీలన రిపోర్టును హైడ్రా కమిషనర్కి అందజేస్తామని, పూర్తి విచారణ తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా అధికారుల వెంట బీజేపీ నాయకులు ఆకుల సతీశ్, ఆంజనేయులు, కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి ఉన్నారు.