నాకే ఓటు వెయ్యవా.. చంపేస్తా!..వ్యక్తిపై వార్డుమెంబర్ అభ్యర్థి దాడి

నాకే ఓటు వెయ్యవా.. చంపేస్తా!..వ్యక్తిపై వార్డుమెంబర్ అభ్యర్థి దాడి

ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదంటూ ఓ వ్యక్తిపై వార్డు మెంబర్​ అభ్యర్థి దాడికి పాల్పడ్డాడు. యాచారం సీఐ నంధీశ్వర్​ రెడ్డి తెలిపిన ప్రకారం.. చౌదర్​ పల్లి గ్రామానికి చెందిన బొద్రమోని రవీందర్ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యుడిగా పోటీచేసి 7 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 

బొద్రమోని మల్లేశ్​ కుటుంబ సభ్యులు తనకు ఓటు వెయ్యకపోవడం వల్లే ఓడిపోయినట్లు భావించాడు. దీంతో శుక్రవారం మల్లేశ్​పై ఆయన దాడికి పాల్పడి చంపుతామని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.