నాలుగు రోజులుగా భర్త డెడ్​ బాడీతో..

నాలుగు రోజులుగా భర్త డెడ్​ బాడీతో..

వైరా, వెలుగు : అనుమానాస్పదంగా మృతి చెందిన భర్త  డెడ్​ బాడీతో  నాలుగు రోజులుగా ఓ భార్య ఇంట్లోనే ఉండిపోయింది.  ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 20వ వార్డు మిట్టపల్లి రైస్ మిల్ సమీపంలో భోగి వీరభద్రం(65) నాలుగు రోజుల కింద అనుమానాస్పదంగా మృతి చెందాడు. వీరభద్రం రైల్వేలో గ్యాంగ్ మన్ గా పనిచేసి రిటైర్​ అయ్యారు.  భార్య మంగమ్మకు కొన్నేండ్ల నుంచి   మతిస్థిమితం లేదు. వీరభద్రం కొడుకు వెంకటకృష్ణ  ఖమ్మంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్​లో ఎస్ డీఈ గా పనిచేస్తున్నారు.

ప్రతీ రోజు వెంకటకృష్ణ తన తండ్రికి  ఫోన్​ చేసి  మాట్లాడుతుండేవాడు.  ఈనెల 6న సాయంత్రం 4 గంటల సమయంలో కూడా వెంకటకృష్ణ తన తండ్రి వీరభద్రంతో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఫోన్​ చేస్తే  లిఫ్ట్​ చేయకపోవటంతో  అనుమానం వచ్చింది.  వెంకటకృష్ణ  వైరాలోని ఇంటికి వచ్చారు.  ఇంట్లో తన తండ్రి కుళ్లిన డెడ్​ బాడీని చూసి షాక్​ అయ్యారు.  మంచంపై ఉన్న డెడ్​బాడీపై భార్య మంగమ్మ ఉప్పు, బియ్యం పోసింది.  ఈ విషయం తెలుసుకున్న కొనిజర్ల పోలీసులు ఘటన స్థలానికి  చేరుకొని ఎంక్వైరీ చేశారు. తన తండ్రి అనారో గ్యంతో చనిపోయి ఉంటాడని, ఎవరిపై అనుమానాలు లేవని వెంకటకృష్ణ ఫిర్యాదు చేశాడు.