కరోనా రాకూడదని.. నల్ల ఉప్పుతో పాలు తాగి యువకుడి మృతి

కరోనా రాకూడదని.. నల్ల ఉప్పుతో పాలు తాగి యువకుడి మృతి
  • ఆస్పత్రిలో మరో ఇద్దరికి ట్రీట్​మెంట్..
  • హైదరాబాద్‌లోని మచ్చబొల్లారం పరిధిలో ఘటన

అల్వాల్, వెలుగు: కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్​(30) ప్రైవేటు ఎంప్లాయ్​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని  ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్​తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు.   కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ ​సీరియస్​గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు.  అతని భార్య, తల్లి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు.  కుటుంబసభ్యుల కంప్లయింట్​తో  అల్వాల్ పోలీసులు  కేసు ఫైల్​ చేశారు.