
ఆస్పత్రిలో పనిచేస్తూ అంతో ఇంతో సంపాదిస్తోంది. డాక్టర్లతో పాటు పెద్ద పెద్ద వారితో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. కానీ.. డబ్బుల కోసం దొంగతనాన్ని ఎంచుకుంది ఆ యువతి. వైద్య సేవా వృత్తిలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన యువతి.. సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న సరిత అనే యువతిని సెల్ ఫోన్ల చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిత కిరాయికి ఉన్న ఇంటితో పాటు పలు ఇళ్లల్లో సెల్ ఫోన్లు చోరీకు పాల్పడుతుందన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.
సరిత నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోమవారం (మే 26) రిమాండ్ కు తరలించారు. సరితపై ఇప్పటికే హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ పీఎస్ లలో పలు చోరి కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.