లోక్ సభలో ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు

లోక్ సభలో ఆధార్‌‌తో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లు

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ అనుసంధానం బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్రం.  విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లుపై చర్చ జరిగింది. విపక్షాలు ఆధార్.. ఓటర్ అనుసంధానం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిల్లు ఉందన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఆధార్ రెసిడెన్స్ ప్రూఫ్ మాత్రమేనని.. సిటిజన్ షిప్ ప్రూఫ్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ప్రతిపక్షాల వాదనలు తీవ్రంగా ఖండించింది కేంద్రం. బోగస్ ఓట్లను తొలగించేందుకే బిల్లు తెచ్చామన్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగడంతో చర్చ జరగక్కముందే సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.