
వికారాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో ఆధార్ కార్డు కీలకమని, ప్రతీ రైతు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్కు లింక్ చేసుకోవాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభం దృష్ట్యా జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.