మంచు లక్ష్మి లీడ్ రోల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదిపర్వం’. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ (అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 1974 – 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్ను సోమవారం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి.
పోస్టర్స్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా అనిపిస్తుంది. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పింది. ‘ఈ చిత్రానికి బలం, బలగం మంచు లక్ష్మి. ఇందులో ఆమె విశ్వరూపం చూస్తారు’ అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇందులో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.