దయచేసి నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రచయిత పోస్ట్ వైరల్

దయచేసి నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రచయిత పోస్ట్ వైరల్

గత నెలరోజులుగా  ఆదిపురుష్(Adipurush) సినిమాపై వస్తున్న విమర్శలపై ఆ చిత్ర రచయిత మనోజ్ ముంతషీర్(Manoj munthashir) ప్రేక్షకులను క్షమాపణలు కోరారు. ఈమేరకు తన ఇన్స్టాగ్రామ్ లో సుధీర్గ పోస్ట్ పెట్టారు. "ఆదిపురుష్ సినిమా వల్ల, సినిమాలోని కొన్నీ సంభాషణల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందుకే నా రెండు చేతులు జోడించి.. మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ప్రభు హనుమాన్ మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన,  గొప్ప సనాతన దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kruti sanon) సీతగా చేసిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలపై ప్రేక్షకుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టులో పీల్స్ కూడా దాఖలు అయ్యాయి. ఇక తాజాగా ఈ వివాదంపై స్పందించిన ఆదిపురుష్ రచయిత.. ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు.