
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బస్పాస్ చార్జీలు పెంచడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన తెలిపింది. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు విజయ్ మల్లంగి మాట్లాడుతూ.. మహిళలకు ప్రయాణం ఉచితం చేసి, పురుషులకు చార్జీలు పెంచడం సరికాదన్నారు. నిరసనలో ఆప్ నేతలు సుధారాణి, లక్ష్య నాయుడు, బాబూలాల్, రాకేశ్రెడ్డి, జావిద్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.