మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బోణీ

మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బోణీ

మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. సింగ్రౌలీలో బీజేపీ అభ్యర్థి ప్రకాష్ విశ్వకర్మపై 9,352 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించి మేయర్ సీటును దక్కించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. రాణి అగర్వాల్ చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాణి అగర్వాల్ సింగ్రౌలి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఆమె తరపున రోడ్ షో నిర్వహించారు. సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో గెలిచిన రాణి అగర్వాల్, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కేజ్రీవాల్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. దేశ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.