సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో ప్రజలే చెప్పాలి: కేజ్రివాల్

సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో ప్రజలే చెప్పాలి: కేజ్రివాల్

గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో ప్రజలే చెప్పాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. సీఎం అభ్యర్థిపై తమ అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. నవంబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు.

ఈ ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కూడా కేజ్రివాల్ ఇలాగే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఆ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించారు. దీంతో గుజరాత్ లో కూడా నలుగురు పేర్లను సూచించారు. ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేయాలని కేజ్రివాల్ కోరారు. SMS, ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాలన్నారు.