క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా?.. సంచలనంగా అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్

క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా?.. సంచలనంగా అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్

ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈకేసులో పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ వ్యాపారి సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈకేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. వారిలో గజ్జల వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ఏ11గా, డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ ను ఏ12గా నమోదు చేశారు. ఈ కేసు విచారణలో సయ్యద్ అబ్బాస్ అలీ సంచలన విషయాలు తెలిపినట్టు సమాచారం. గత ఏడాది నుండే గజ్జల వివేకానందకు డ్రగ్స్ అలవాటు అయిందని, వివేక్ తన స్నేహితులు క్రిష్, నిర్భయ్ సింధీతో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడని అబ్బాస్ వెల్లడించారట.

అలాగే.. ఈ నెల(ఫిబ్రవరి 2024) 24న కూడా రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్ పార్టీలో క్రిష్ పాల్గొన్నాడని, ఇంకా ఈ పార్టీలో శ్వేత, లిషి, నీల్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని అబ్బాస్ వెల్లడించాడని సమాచారం. వారికి సప్లై చేసిన డ్రగ్స్ ను మీర్జా వహీద్ బేగ్ నుంచి కొనుగోలు చేశానని, అవి వివేకా డ్రైవర్ గద్దల ప్రవీణ్ కి అందజేస్తున్నానని అబ్బాస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వాట్సప్ చాటింగ్ కూడా పోలీసులు గుర్తించినట్లుగా  సమాచారం.