డ్రగ్స్ కేసుపై క్రిష్ క్లారిటీ..!

డ్రగ్స్ కేసుపై క్రిష్ క్లారిటీ..!

తాజాగా బయటపడ్డ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు టాలీవుడ్లో కలకలం రేపుతోంది. పోలీసుల దాడిలో పట్టుబడ్డ వివేకానందతో డైరెక్టర్ క్రిష్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధాలు ఉన్నయాన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ ను A8 గా చేర్చిన పోలీసులు విచారించారు. ఈ కేసుపై స్పందించాడు దర్శకుడు క్రిష్. తాను హోటల్ కి వెళ్ళింది నిజమే కానీ, డ్రగ్స్ పార్టీలో పాల్గొనలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని అన్నాడు.

డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో తన స్నేహితులు రాడిసన్ హోటల్లో ఉన్నారని, వారిని కలవడానికి మాత్రమే హోటల్ కి వెళ్లానని క్లారిటీ ఇచ్చాడు క్రిష్. రాడిసన్ హోటల్ 45నిమిషాలు మాత్రమే ఉన్నానని, పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. క్రిష్ పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చాడు.

డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వివేకానంద సహా 9మంది పైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ పార్టీకి కొకైన్ సప్లై చేసిన అబ్బాస్ అలీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిష్ తో సహా ఈ పార్టీలో కేదార్, నిర్భయ్, లీలా, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్ లు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.