అమృత్ సర్ కి చేరిన అభినందన్ ఫ్యామీలీ

అమృత్ సర్ కి చేరిన అభినందన్ ఫ్యామీలీ

వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్తాన్….వాఘా బోర్డర్ దగ్గర భారత్ కు అప్పగించనుంది. అభినందన్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రతినిధి బృందం రిసీవ్ చేసుకోనుంది. మరోవైపు అభినందన్ కోసం ఆయన తల్లిదండ్రులు చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

ఆ వెంటనే అమృత్ సర్ బయల్దేరి వెళ్లారు. వాఘా బోర్డర్ లో అభినందన్ ను రిసీవ్ చేసుకోనున్నారు. ఢిల్లీ ఫ్లైట్ లో అభినందన్ పేరెంట్స్ ను తోటి ప్రయాణికులు చప్పట్లతో స్వాగతం పలుకుతూ అభినందించారు.