గాంధీనగర్: ఈ టీ20 వరల్డ్ కప్లో పేలవ ఫామ్తో నిరాశ పరుస్తోన్న టీమిండియ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచులో దుమ్మురేపాడు. ఆట ఆరంభం నుంచే ఎలాంటి ఒత్తిడి లేకుండా సిక్సులు, ఫోర్లు బాదాడు.
ఈ క్రమంలో 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు బాది తన సహాజ శైలీలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచులో అభి ఫామ్లోకి రావడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. మరో ఓపెనర్ సంజు శాంసన్ కూడా దుమ్మురేపుతున్నాడు. దీంతో పవర్ ప్లేలో టీమిండియా 92 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అభి 52, సంజు శాంసన్ 38 క్రీజులో ఉన్నారు.
భారత్ ప్లేయింగ్ ఎలైవన్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలైవన్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
