అబుదాబి: మన దేశానికి చెందిన అల్ట్రా మారథాన్ రన్నర్ ఆకాశ్ నంబియార్ అబూదాబి నుంచి దుబాయ్కి రన్నింగ్ చేశాడు. బెంగళూరుకు చెందిన నంబియార్ను ‘బేర్ ఫూట్ మల్లూ’ అని పిలుస్తారు. 118 కిలోమీటర్లను 27 గంటల్లో పూర్తి చేశాడని గల్ఫ్ న్యూస్ దీనిపై వార్త రాసింది. అబూదాబిలోని ‘ఈ11’ హైవేపై జనవరి 25న రన్నింగ్ స్టార్ట్ చేసిన నంబియార్ 26 న దుబాయ్లోని బట్టూటా మాల్కు చేరుకున్నారని లోకల్ మీడియా చెప్పింది.
“ యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ (యూఏఈ) యువతలో ఫిట్నెస్పై అవగాహన కల్పించేందుకు ఈ చాలెంజ్ తీసుకున్నాను. ఊబకాయం, పొగ తాగడం వల్ల 35 ఏళ్ల వయసు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నా ఫ్రెండ్ ఖలీద్ అల్ సువైదా అబూదాబి నుంచి మక్కా వరకు పరిగెత్తాడు. అతడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నాను” అని నంబియార్ చెప్పారు.