హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్  యూనివర్సిటీ లో  ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఏబీవీపీ.ఎస్ఎఫ్ఐ నాయకులు  ఒకరిపై ఒకరు బ్లేడులతో  దాడి  చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. అయితే గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ఫిబ్రవరి 25న ఇదే తరహాలో  ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థులు  పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.  స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో వాల్ పోస్టర్స్ అతికించే విషయంలో  విద్యార్థులు గొడవపడ్డారు.