- స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
- ఏబీవీపీ డిమాండ్
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు అన్నారు. సోమవారం మారేడ్పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేల్లు పూర్తయినా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. దీంతో ప్రైవేట్ కాలేజీలు మూతపడుతున్నాయని, విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాండురంగా, కృష్ణ, వెంకట్, రామ్, శ్రీరామ్, రిషి, వినోద్, పవన్ పాల్గొన్నారు.
కూకట్పల్లిలో రాస్తారోకో..
కూకట్పల్లి: స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ భరత్ ఆధ్వర్యంలో సోమవారం కూకట్పల్లిలో రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.
