ఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఆందోళన

ఎక్కువ రేట్లకు బుక్స్  అమ్ముతున్నారని ఆందోళన

గద్వాల టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు గురువారం గద్వాలలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు ఆందోళన చేశారు.  ఈ సందర్భంగా స్టేట్​ సెక్రెటరీ సతీశ్​ మాట్లాడారు. వెంటనే  డీఈవో వచ్చి చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు బైఠాయించారు. అక్కడికి వచ్చిన ఎంఈఓ సురేశ్ ​కారును అడ్డుకున్నారు. 

పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. స్టేషనరీ షాప్ లుగా  ప్రైవేటు స్కూల్స్ మారాయని పీడీఎస్ యూ రాష్ట్ర నాయకుడు తిరుమలేశ్ ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.