ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన

ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన

మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేఎంసీ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అరెస్ట్  చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.