రాజన్న సిరిసిల్లలో ఏసీబీ దాడులు.. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్..

రాజన్న సిరిసిల్లలో ఏసీబీ దాడులు..  రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు.. శనివారం (  మే 31 ) నిర్వహించిన ఈ దాడుల్లో రూ. 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు సర్వేయర్ నాగరాజు. ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు రైతు దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల సర్టిఫికెట్ కోసం సర్వేయర్ నాగరాజును ఆశ్రయించారు.

మల్లేశం గతంలో ఇదే సర్వేయర్ కి కొలతల సర్టిఫికెట్ కోసం నాగరాజు రూ. 22 వేలు లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది.. చంద్రన్నపేట రైతు వేదిక దగ్గర మరో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు సర్వేయర్ నాగరాజు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు సర్వేయర్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నాగరాజును ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు అధికారులు.