‘గిఫ్ట్‌‌‌‌’ రిజిస్ట్రేషన్‌‌‌‌కు రూ. లక్ష డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌

‘గిఫ్ట్‌‌‌‌’ రిజిస్ట్రేషన్‌‌‌‌కు రూ. లక్ష డిమాండ్‌‌‌‌..ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌
  • రూ. 50 వేలకు ఒప్పందం
  • రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌

ఖమ్మం రూరల్, వెలుగు : గిఫ్ట్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసేందుకు లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ఖమ్మం రూరల్‌‌‌‌ సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ అరుణను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూరల్‌‌‌‌ మండలం తల్లంపాడులో రెండు వేల గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని తన కొడుకు పేరున గిఫ్ట్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసేందుకు రూరల్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ అరుణను కలిశాడు. పని పూర్తి కావాలంటే రూ. లక్ష ఇవ్వాలని సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేసింది. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 50 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు.

వారి సూచన మేరకు సోమవారం రూ. 30 వేలు ఇచ్చేందుకు సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు వెళ్లాడు. అక్కడ డాక్యుమెంట్‌‌‌‌ రైటర్‌‌‌‌ పుచ్చకాయల వెంకటేశ్వరరావును కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రైటర్‌‌‌‌ వెంకటేశ్వరరావును పట్టుకున్నారు. దీంతో సబ్‌‌‌‌రిజిస్ట్రారే డబ్బులు తీసుకోవాలని సూచించిందని అతడు చెప్పాడు. అనంతరం అతడు తీసుకున్న డబ్బులను సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ అందిస్తుండగా రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు.